SscTelugu Vyakaranam || 10th Class Telugu Vyakaranam || telugu grammar || తెలుగు వ్యాకరణం తెలుగు గ్రామర్

 


ఈ 10వ తరగతి తెలుగు వ్యాకరణం కు సంబంధించిన ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో 10ప్రశ్నలకు సమాధానాలు రాసి submit చేసిన తరువాత View Result లో వెంటనే మార్కులను తెలుసుకోవచ్చు. మరోసారి ప్రయత్నించి మార్కులను మెరుగుపరుచుకోవచ్చు Practice Test ను ఈ కింది లింక్ ను క్లిక్ చేసి 👇రాయవచ్చు👇

ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ వెబ్ పేజీ చూడవచ్చు 👇👇









ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా సరదా జానపద కథ 👇👇

ఉడుతా భక్తి (జాతీయం వెనుక కథ)
********
     ఉడుతా భక్తి అంటే ఎవరికి వారు వారికి చేతనైనంత సహాయం చేయడం. అది రూపాయ కావచ్చు, వెయ్యి రూపాయలు కావచ్చు. నీ స్థితికి తగినంత సహాయం చేస్తే రెండూ సమానమే. చేయాలి అనే కోరిక ముఖ్యం. ఒక్కొక్క నీటి బొట్టే పెద్ద వానగా మారినట్లు అనేక మంది చేసే చిన్న చిన్న సహాయాలే పెద్ద మొత్తంగా మారిపోతాయి. భూకంపాలు, వరదలు, తుఫాన్లు లాంటి అపదలు సంభవించి ప్రజలు వున్నదంతా కోల్పోయి వీధిన పడినపుడు... దేశమంతా ఒక్కటై చేతులు కలిపి చేసే చిన్న చిన్న సహాయాలే వాళ్ళ జీవితాల్ని నిలబెట్టి కొత్త జీవితానికి నాంది వేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు గూడా నా దగ్గర వున్నది చాలా చిన్న మొత్తం గదా... దీని వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం వుండదు అని భావించకుండా ఎవరికి వారు వారికి తోచినంత, చేతనైనంత సహాయం చేస్తూ ఆపదల్లో అండగా నిలబడాలి. ఏదైనా ఒక మంచి పని తలపెట్టినప్పుడు మనవంతుగా మనం అందించే ఈ తోడ్పాటునే ఉడుతా భక్తి అంటారు.

ఈ జాతీయం మన ఇతిహాసమైన రామాయణ గాధ నుండి వ్యాప్తి చెందింది. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలోని అశోకవనంలో బంధించాడు. శ్రీరాముడు సీతాదేవి జాడకోసం వెదుకుతూ సుగ్రీవునితో స్నేహం చేసి అతని శత్రువైన వాలిని సంహరించి కిష్కింధ నగరానికి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుడు రామునికి ఇచ్చిన మాట ప్రకారం సీతాదేవిని వెదకడానికి సైన్యాన్ని నాలుగు వైపులా పంపించాడు. దక్షిణం వైపు వెళ్ళిన హనుమంతుడు అడ్డం వచ్చిన సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. అశోకవనంలో సీత వున్నది కనుక్కొని తిరిగివచ్చి రామునికి చెప్పాడు. రాముడు లంకపై దండెత్తడానికి వానర సైన్యంతో బైలు దేరాడు. సముద్రాన్ని దాటడం కోసం దారి ఇవ్వమని వేడుకున్నా సముద్రుడు లెక్కచేయలేదు. దాంతో ఆగ్రహించిన రాముడు సముద్రం మీదకు బాణం ఎక్కు పెట్టాడు. భయపడ్డ సముద్రుడు చేతులు జోడించి రాముని ముందు ప్రత్యక్షమై తనపై వేసే రాళ్ళు, చెట్లూ అన్నీ నీటిలో తేలేలా చేస్తానని వారధి కట్టి సముద్రం దాటమని చెప్పాడు. దాంతో వానరులంతా పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఆనకట్ట కట్టడం మొదలు పెట్టారు. ఈ కథంతా ఇక్కడ ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా... ఇక్కడే మన అసలు కథ మొదలయ్యేది అందుకన్నమాట.

వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఆనకట్ట కడుతున్నారు గదా... అక్కడ ఒక చెట్టుమీద ఒక చిన్న ఉడుత వుంది. దానికి రాముడంటే చానా ఇష్టం. తానుగూడా రామునికి ఆనకట్ట కట్టడంలో సహాయపడాలి అనుకొంది.

కానీ ఉడుత ఎంతుంటాది. మన పడికెడంత. అది సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత. కానీ ఆ ఉడుత అట్లా అనుకోలేదు. రాముడు చేయబోయే 

ఈ మంచి పనికి తాను తోడుగా నిలబడాలి అనుకొనింది. వెంటనే పోయి ఇసుకలో పొర్లాడింది. అప్పుడు దాని ఒళ్ళంతా ఇసుక అంటుకోగానే సంబరంగా వురుక్కుంటా ఆనకట్టమీదకు పోయి, అక్కడ ఇసుకంతా విదల్చసాగింది. అట్లా ఆ ఉడుత ఒక్క క్షణం గూడా ఆగకుండా అలసిపోకుండా మరలా మరలా చేయసాగింది.

రాముడు ఆ ఉడుత భక్తిగా చేస్తున్న పనిని చూశాడు. దాన్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తమ్ముడు లక్ష్మణునికెళ్ళి చూసి "చూశావా... తమ్ముడు... ఇది నిజమైన భక్తి అంటే. ప్రతి ఒక్కరూ ఇలా తమంతట తాము, తనకు చేతనైనంత సహాయం చేస్తూ మంచి పనులకు మద్దతుగా నిలబడాలి. అప్పుడే లోకంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. మనకు ఏం చేతనవుతుందిలే, మనం సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత, మనం సహాయం చేసినా అది పెద్దగా ఉపయోగపడదులే... ఇలాంటి భావనలు వదలుకోవాలి. ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. " అంటూ ఆ ఉడుత వీపు మీద ప్రేమగా మూడు వేళ్ళతో నిమిరాడు.

అంతకు ముందు వరకు ఉడుతకు వీపుమీద చారలు వుండేవి కాదంట. రాముడు ఎప్పుడైతే సంతోషంగా నిమిరాడో ఆ చేతివేళ్ళ గుర్తులు ఉడుత మీద పడి అట్లాగే శాశ్వతంగా వుండిపోయాయట. ఇప్పటికీ మనం ఉడుత వీపుమీద గుర్తులు చూడవచ్చు. అప్పటినుంచీ చిన్నదైనా పెద్దయినా ఎవరికి చేతనైన సాయం వారు చేస్తే దానిని ఉడుతా భక్తి అంటారు.
*******
డా.ఎం.హరికిషన్-కర్నూలు-రచయిత గారికి ధన్యవాదములు
*******
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.


🙏🤝Thank you Visit Again 🤝🙏