Andhrapradesh all Cet's information

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం  నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 


వీటిల్లో ఏపీ ఈఏపీ సెట్, ఏపీఈ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్ సెట్, ఏపీ పీజీఈ సెట్, ఏపీ లాసెట్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్లకు online  విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్పులు, ప్రవేశ పరీక్షల విధానం గురించి పూర్తి వివరణ.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీ సెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫా ర్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2021 కు నోటిఫికే షన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్టు... ఈ ఏ పీసెట్ (పూర్వపు ఎంసెటి). ఈ ఏడాది ఈఏపీ సెట్ ను జేఎన్‌టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది.


ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఆ గ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టిక ల్చర్, బీవీఎస్సీ " అండ్ ఏహెచ్, బీఎస్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ.

అర్హతలు

* ఇంజనీరింగ్, ఫార్మసీ (ఎంపీసీ), ఫార్మా డీ. బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవే శాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్స మాన అర్హత ఉండాలి.  

బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ హార్టికల్చర్/బీవీ ఎస్సీ అండ్ ఏహెచ్/బీఎస్సీ /బీటెక్ (ఎస్ఏ స్టీ)/ బీఎస్సీ(సీఏ అండ్ బీఎం) (బీఫార్మసీ/ బీ టెక్( బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీ సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ బైపీసీ (తత్సమాన అర్హత ఉండాలి.


ఇంజనీరింగ్ పరీక్ష విధానం: ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్ ఆన్ లైన్ (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ) విధా నంలో జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులకు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు - 40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులకు సెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.


• అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రిక ల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్ ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినే షన్) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు- 160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధా నంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ  80 ప్రశ్నలు-80 మార్కుల(బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్ 40 ప్రశ్నలు- 40 మార్కుల, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు - 40 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఈఏపీసెట్లో అర్హత సాధించేందుకు కనీసం 25 % మార్కులు రావాలి. ఎంట్రెన్స్ లో సాధించిన మార్కులకు 75 % వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.


* దరఖాస్తు విధానం:  ఆన్లైన్ 

* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021 

పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు


ఏపీ ఈసెట్

ఏపీ ఈ సెట్(ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రీ న్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్‌టీయూ నిర్వహించనుంది. 


అర్హతలు

 కనీసం 45% మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీ ర్ణులై ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు 40% మార్కులు సాధించాలి.


పరీక్ష విధానం

• ఈ సెట్ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. 

• ఇంజనీరింగ్ విభాగంలో.. మ్యాడ్స్ 50 ప్రశ్నలు -50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు-25 మార్కులు, ఇంజనీరింగ్ సంబంధిత బ్రాంచ్) 100 ప్రశ్నలు - 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది.

ఫార్మసీ విభాగంలో., ఫార్మాస్యూటిక్స్-50 ప్రశ్న లు-50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ50 ప్రశ్నలు-50 మార్కులు, ఫార్మకాలజీ-50 ప్రశ్నలు-50 మార్కులు, ఫార్మాకోగ్నసీ-50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. .

బీఎస్సీ (మ్యాడ్స్) విభాగంలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు-100 మార్కులు, అనలిటికల్ ఎబి లిటీ 50 ప్రశ్నలు-50 మార్కులకు, కమ్యూనికే టివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్య సమాచారం

• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 

• పరీక్ష తేది: 19.09.2021 


ఏపీ ఐసెట్

ఆంధ్రప్రదేశ్ లోని కాలేజీల్లో మాస్టర్ ఆఫ్ బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూ టర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్-2021 కు నోటిఫికేషన్ విడుద లైంది. ఈ ఏడాది ఐసెట్ ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది.


అర్హతలు

10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ completed  అభ్యర్థులు ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు చేసుకో వచ్చు.

ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్య ర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధిం చాలి. 

పరీక్ష విధానం

ఐసెట్ పరీక్ష 200 ప్రశ్నలు-200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగు తుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్సన్ ఏలో ఆనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు75 మార్కులు, సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎటి లిటీ 70 ప్రశ్నలు- 10 మార్కులకు ; సెక్షన్ సీలో  మ్యాథమెటికల్ ఎబిలిటీ 55 ప్రశ్నలు-55 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు.


దరఖాస్తు విధానం: ఆన్ లైన్ 

- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021 

పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 17, 18 


AP EDCET

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ /గవ ర్నమెంట్/ఎయిడెడ్/ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకే షలో... రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్( బీఈ డీ) రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడిసెట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హత:

బీఏ/బీకామ్/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిం చిన విద్యార్థులు ఎడిట్‌కు దరఖాస్తు చేసుకో వచ్చు. బీటెక్/బీఈలో 50 మార్కులు తెచ్చుకు న్నవారు సైతం బీఈడీలో చేరవచ్చు 


పరీక్ష విధానం:

 ఆట్టె క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో జనరల్ ఇంగ్లీష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు- 15 మార్కులు, టీచింగ్ అప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు: -మెథ డాలజీలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు-100. మార్కులు/ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్-50, కెమిస్ట్రీ -50/బయలాజికల్ సైన్స్: బోటనీ-50, జువా లజీ-50/సోషల్ స్టడీస్, జాగ్రఫీ-35, చరిత్ర30, సివిక్స్-15, ఎకనామిక్స్-20 (మొత్తం 10 0)/ ఇంగ్లిష్- 100 ప్రశ్నలు- 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021 

• ఎడ్ సెట్ పరీక్ష తేది: 21.09.2021


ఏపీపీజీఈ సెట్ 

ఆంధ్రప్రదేశ్ లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజ నీరింగ్(ఎంటెక్/ఎంఈ/ఎంఫార్మా, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈ సెట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంవత్సర,  

అర్హత: 


బీటెక్/బీఈ / బీఫార్మసీ కోర్సుల్లో 50% మార్కులు సాధించాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45% మార్కులు రావాలి . పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవా బులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధా రంగా ఉంటాయి.


* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

• ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021 

ఏపీపీజీఈ సెట్ తేదీలు:27-30 సెప్టెంబర్ 2021 


ఏపీ లాసెట్, పీజీ లాసెట్:

 ఎన్ఎల్ బీ, ఎఎఎం కోర్సుల్లో ప్రవే శాలకు ఉద్దేశించిన ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామం డలి తరపున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది. 

ఎంట్రెన్స్: ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2021


ప్రవేశం కల్పించే కోర్సులు: 

మూడేళ్ల, ఐదేళ్ల రెగ్యు లర్ ఎల్ఎల్ బీ కోర్సు, రెండేళ్ల ఎఎఎం కోర్సు

అర్హతలు: 


మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ complete  అభ్య ర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్ల కోర్సుకు 45% మార్కులతో ఇంటర్మీడియట్ తత్స మాన అర్హత ఉండాలి.

ఏపీ లాసెట్ మొత్తం 120 ప్రశ్నలు- 120 మార్కులకు జరుగుతుంది. ఇందులోGK అండ్ మెంటల్ ఎబిలిటీ-30, కరెంట్ అఫైర్స్-30, లా అప్టిట్యూడ్- 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం గంటన్నర.


• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.07 2021

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 20.08.2021

పరీక్ష తేది: 22.09.2021